Asianet News TeluguAsianet News Telugu

ఏపీ: 24 గంటల్లో 400 మందికి పాజిటివ్.. రాష్ట్రంలో 20,60,682కి చేరిన కరోనా కేసుల సంఖ్య

ఏపీలో కొత్తగా 400 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 516 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 5,102 మంది చికిత్స పొందుతున్నారు

400 new corona cases reported in andhra pradesh
Author
Amravati, First Published Oct 24, 2021, 6:12 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో కొత్తగా 400 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,60,682కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,343కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 516 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,41,237 కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 37,744 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,92,64,255కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 5,102 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 8, చిత్తూరు 73, తూర్పుగోదావరి 31, గుంటూరు 50, కడప 25, కృష్ణ 68, కర్నూలు 3, నెల్లూరు 22, ప్రకాశం 9, శ్రీకాకుళం 29, విశాఖపట్నం 33, విజయనగరం 7, పశ్చిమ గోదావరిలలో 42 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios