Asianet News TeluguAsianet News Telugu

ఏపీ: 24 గంటల్లో 163 మందికి కరోనా.. గోదావరి జిల్లాల్లో మళ్లీ పెరుగుతున్న కేసులు..

ఏపీలో కొత్తగా 163 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 162 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,821 మంది చికిత్స పొందుతున్నారు.

163 new corona cases reported in andhra pradesh
Author
Amaravathi, First Published Dec 15, 2021, 5:56 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 163 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,72,376కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,471కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 162 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,56,084కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 35,071మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,08,62,705కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1821 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 7, చిత్తూరు 25, తూర్పుగోదావరి 25, గుంటూరు 18, కడప 4, కృష్ణ 7, కర్నూలు 3, నెల్లూరు 12, ప్రకాశం 7, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 15, విజయనగరం 10, పశ్చిమ గోదావరిలలో 20 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios