Asianet News TeluguAsianet News Telugu

వాటర్‌ ట్యాంకులో శవమై తేలిన 15 నెలల చిన్నారి.. అమ్మమ్మపైనే అనుమానం

నెల్లూరు రూరల్ మండలంలో వాటర్ ట్యాంకులో 15 నెలల పసిపాప శవమై తేలడం సంచలనం సృష్టించింది. ఆమె అమ్మమ్మపైనే తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

15 months baby found dead in water tank ksp
Author
Nellore, First Published Jul 9, 2021, 3:14 PM IST

నెల్లూరు రూరల్‌లో దారుణం జరిగింది. స్థానిక రంగనాయకుల పేట గొల్లవీధిలో 15 నెలల ఆడ శిశువును వాటర్ ట్యాంకులో పడేసి హత్య చేశారు దుండగులు. వాటర్ ట్యాంక్‌లో పాప మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారికి వరుసకు అమ్మమ్మ అయ్యే మహిళపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios