Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కొనసాగుతున్న కరోనా జోరు.. 24 గంటల్లో 13,618 కేసులు, విశాఖలో విజృంభణ

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,618 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,19,678కి చేరుకుంది.

13618 new corona cases reported in andhra pradesh
Author
Amaravathi, First Published Jan 26, 2022, 6:03 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,618 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,19,678కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్నంలలో ఇద్దరు చొప్పున... చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,570కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 8,687 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,71,705కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 49,143 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,22,83,369కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,06,318 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 1650, చిత్తూరు 493, తూర్పుగోదావరి 961, గుంటూరు 1464, కడప 907, కృష్ణ 803, కర్నూలు 1409, నెల్లూరు 1007, ప్రకాశం 1295, శ్రీకాకుళం 644, విశాఖపట్నం 1791, విజయనగరం 466, పశ్చిమ గోదావరిలలో 728 చొప్పున వైరస్ బారినపడ్డారు. 

మరోవైపు భార‌త్ లో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 2,85,914 క‌రోనా (Coronavirus) పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అంత‌కు మందు రోజుతో పోలిస్తే.. దాదాపు 11.7 శాతం కేసులు పెరిగాయి. మ‌ర‌ణాలు సైతం నిన్న‌టి పోలిస్తే అధికంగా న‌మోద‌య్యాయి. నిన్న 571 క‌రోనా మర‌ణాలు న‌మోదుకాగా, కొత్త‌గా 665 మంది కోవిడ్‌-19 తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇదే స‌మ‌యంలో 2,99,073 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. 

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 22,23,018 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,00,85,116 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 4,91,127 (Coronavirus) మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ప్ర‌స్తుతం మ‌హ‌రాష్ట్ర, క‌ర్నాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో క‌రోనా కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. భార‌త్ రోజువారీ క‌రోనా పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది. 

క‌రోనా వైర‌స్ (Coronavirus) క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ఇప్ప‌టికే చాలా రాష్ట్రాలు ఆంక్ష‌లు విధించాయి. అలాగే, కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల‌ను పెంచ‌డంతో పాటు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 1,63,58,44,536 క‌రోనా టీకా డోసుల పంపిణీ జ‌రిగింది. ఇందులో మొద‌టి డోసు తీసుకున్న వారు 88.9 కోట్ల మంది ఉన్నారు. రెండు డోసుల క‌రోనా (Coronavirus) వ్యాక్సిన్ తీసుకున్న వారు 69.4 కోట్ల మంది ఉన్నారు.  

అలాగే, క‌రోనా ప‌రీక్ష‌లు సైతం అధికంగ నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 71,88,02,433 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి వెల్ల‌డించింది.  మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 16,49,108 (Coronavirus) శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. మొత్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాను గ‌మ‌నిస్తే.. మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్రదేశ్‌, వెస్ట్ బెంగాల్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఢిల్లీ, ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్ లు టాప్‌లో ఉన్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios