Asianet News TeluguAsianet News Telugu

24 గంటల్లో 1,361 కేసులు.. నెల్లూరులో అత్యధికం, ఏపీలో 20,21,708కి చేరిన సంఖ్య

ఏపీలో కొత్తగా 1,361 కరోనా కేసులు నమోదవ్వగా.. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,288 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,510 మంది చికిత్స పొందుతున్నారు.

1361 new corona cases reported in andhra pradesh
Author
Amaravati, First Published Sep 8, 2021, 7:01 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో రెండు రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,361 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,21,708కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,510కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో 1, గుంటూరు 2, కృష్ణ 3, ప్రకాశం 2, కడప 1, నెల్లూరు 3, తూర్పుగోదావరి 2, పశ్చిమ గోదావరిలలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,288 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,93,248కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 61,363 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,70,99,014కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,510 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 26, చిత్తూరు 203, తూర్పుగోదావరి 143, గుంటూరు 131, కడప 104, కృష్ణ 99, కర్నూలు 13, నెల్లూరు 282, ప్రకాశం 87, శ్రీకాకుళం 25, విశాఖపట్నం 73, విజయనగరం 26, పశ్చిమ గోదావరిలలో 149 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios