Asianet News TeluguAsianet News Telugu

వరుసగా రెండో రోజూ తగ్గిన కేసులు: ఏపీలో కొత్తగా 13,400 మందికి పాజిటివ్.. తూ.గోలో అదే తీవ్రత

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 13,400 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 16,85,142కి చేరుకుంది

13400 new corona cases reported in andhra pradesh ksp
Author
Amaravathi, First Published May 30, 2021, 6:24 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండోరోజు కరోనా కేసులు భారీగా పడిపోయాయి. కర్ఫ్యూ అమలు చేస్తుండటం మంచి ఫలితాలు ఇస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మరో రెండు వారాలు పగటిపూట కర్ఫ్యూను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం మంత్రులు, అధికారులతో ఆయన కీలక సమీక్ష నిర్వహించి.. దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. 

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 13,400 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 16,85,142కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 94 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10,832కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 6, ప్రకాశం 8, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, చిత్తూరు 14, గుంటూరు 4, కర్నూలు 5, నెల్లూరు 5, కృష్ణ 6, విశాఖపట్నం 8, శ్రీకాకుళం 8, పశ్చిమ గోదావరి 9, ప్రకాశం 9, కడపలో నలుగురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 21,133 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 15,08,515కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 74,232 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,91,72,843కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,65,795 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1215, చిత్తూరు 1971, తూర్పుగోదావరి 2598, గుంటూరు 848, కడప 701, కృష్ణ 858, కర్నూలు 712, నెల్లూరు 652, ప్రకాశం 838, శ్రీకాకుళం 623, విశాఖపట్నం 1054, విజయనగరం 362, పశ్చిమ గోదావరిలలో 968 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios