Asianet News TeluguAsianet News Telugu

ఏపీ: 24 గంటల్లో 121 కరోనా కేసులు.. చిత్తూరు జిల్లాలో అత్యధికం

ఏపీలో కొత్తగా 121 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 228 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,597 మంది చికిత్స పొందుతున్నారు.

121 new corona cases reported in andhra pradesh
Author
Amaravathi, First Published Dec 19, 2021, 6:01 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా (corona cases in ap) తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 121 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,72,191కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,479కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 228 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,56,833కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 29,643 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,09,90,296కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1597 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 1, చిత్తూరు 32, తూర్పుగోదావరి 7, గుంటూరు 10, కడప 6, కృష్ణ 20, కర్నూలు 0, నెల్లూరు 11, ప్రకాశం 1, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 13, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 13 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios