విశాఖ అనకాపల్లిలో రోడ్డు ప్రమాదం - తండ్రి కూతురు మృతి

Sep 6, 2020, 3:10 PM IST

అనకాపల్లిలో కళ్ళముందే భర్త, బిడ్డ ప్రమాదంలో మరణించడం ఆ తల్లికి తీవ్ర ఆవేదన మిగిల్చింది.విశాఖపట్నం మల్కాపురంలో డాక్ యార్డ్ లో జాబ్ చేస్తున్న అగ్రహారపు రాజు (36) తన సొంత గ్రామమైన మాడుగుల నియోజకవర్గం వీరనారాయణ గ్రామం వెళదామని భార్య కూతురు హయాతి తో కలిసి  తన ద్విచక్రవాహనంపై ఆదివారం ఉదయం బయల్దేరారు.వారు అనకాపల్లి జమధల మదుం చేరే సరికి వేగంగా వస్తున్న లారీ ఢీ కొనడంతో రాజు , కూతురు హయాతి అక్కడికక్కడే మరణించారు.భార్య కు స్వల్ప గాయాలయ్యాయి.