చిరంజీవికి అక్కగా నటించింది, ఒక్కసారైనా హీరోయిన్ గా చేయాలని ఉందట..ఎన్టీఆర్ విషయంలో ఆమె కోరిక వింటే

First Published Apr 30, 2024, 5:01 PM IST

90 వ దశకంలో సౌత్ మొత్తం స్టార్ హీరోలతో నటించిన నటీమణుల్లో ఖుష్బూ ఒకరు. బోల్డ్ గా వ్యవహరించే హీరోయిన్ గా ఖుష్బూ గుర్తింపు పొందింది. మహిళల సమస్యలు, ఇతర వ్యవహారాల గురించి ఆమె ఓపెన్ గా కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇ

90 వ దశకంలో సౌత్ మొత్తం స్టార్ హీరోలతో నటించిన నటీమణుల్లో ఖుష్బూ ఒకరు. బోల్డ్ గా వ్యవహరించే హీరోయిన్ గా ఖుష్బూ గుర్తింపు పొందింది. మహిళల సమస్యలు, ఇతర వ్యవహారాల గురించి ఆమె ఓపెన్ గా కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వంలో తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో బాక్ అనే చిత్రం తెరకెక్కింది. 

ఈ మూవీలో ఖుష్బూ కూడా ఓ పాత్రలో నటించింది. ఈ చిత్రం మే 3న రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ఖుష్బూ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. ఖుష్బూ నటిగా మాత్రమే కాదు నేషనల్ వుమెన్ కమిషన్ మెంబర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా తమిళనాడు రాజకీయాల్లో ఖుష్బూ క్రియాశీలకంగా ఉన్నారు. బిజెపి లో ఆమె కీలక నేతగా ఉన్న సంగతి తెలిసిందే. 

విక్టరీ వెంకటేష్ కలియుగ పాండవులు చిత్రంతో ఖుష్బూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఏపీ రాజకీయాలపై, మహిళల సమస్యలపై.. అలాగే తన ఫ్యామిలీ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. విమెన్ కమిషన్ మెంబర్ గా ఆమె మాట్లాడుతూ.. భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడం.. చేయి ఎత్తడం లాంటివి చేయకూడదు అని తెలిపింది.

 మా ఆయనతో కూడా నాకు గొడవలు వస్తుంటాయి. కొన్ని రోజులు మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉండిపోతాం. కోపం మరీ ఎక్కువైతే ఇంట్లో ఉన్న ప్లేట్లు పగల గొడతా అంటూ ఖుష్బూ ఫన్నీగా చెప్పింది. మా మధ్య మా పిల్లలే పోస్ట్ మ్యాన్ లాగా వ్యవహరిస్తారు అని ఖుష్బూ నవ్వుతూ కామెంట్స్ చేసింది. 

ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ త్వరలో తాను ఏపీలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని అన్నారు. అజ్ఞాతవాసి టైంలో పవన్ రాజకీయాల్లో ఉన్నారని తెలుసు. కానీ అయన ఎప్పుడూ పాలిటిక్స్ గురించి చర్చించలేదు. ఇప్పుడు బిజెపితో పొత్తులో ఉన్నారు. ఆయన అడిగితే ఎక్కడ అవసరం అయితే అక్కడ ప్రచారం చేస్తానని ఆమె తెలిపారు. 

హీరోయిన్ గా అందరు స్టార్లతో నటించా. బాలయ్యతో ఇంతవరకు నటించలేదు. చిరంజీవి గారితో హీరోయిన్ గా నటించలేదు. వాళ్ళిద్దరికీ హీరోయిన్ గా నటించాలనేది నా కోరిక. ఆ ఛాన్స్ కోసం వైట్ చేస్తున్నట్లు ఖుష్బూ పేర్కొంది. చిరంజీవితో ఖుష్భూ.. స్టాలిన్ చిత్రంలో అక్క పాత్రలో నటించింది. కానీ ఎలాగైనా హీరోయిన్ గా నటించాలనే కోరిక బయట పెట్టింది. 

ప్రస్తుతం ఉన్న యువ నటుల్లో నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. యమదొంగ లో నటించినప్పటికీ తారక్ తో మరో సినిమా చేయాలనీ ఉంది. కానీ ఈసారి చాలా కీలకమైన పాత్ర అయితేనే చేస్తాను అని ఖుష్బూ కామెంట్స్ చేసింది. అప్పుడప్పుడూ సీనియర్ హీరోలు సీనియర్ హీరోయిన్లాతో జత కట్టడం చూస్తూనే ఉన్నాం. ఆవిధంగా చిరు బాలయ్యతో ఖుష్బూ కోరిక తీరుతుందేమో చూడాలి. 

click me!