కరీంనగర్ జిల్లా కోర్టు ఎదుట డ్రైనేజీలో... మహిళ మృతదేహం కలకలం

Mar 23, 2021, 12:02 PM IST

కరీంనగర్ జిల్లా ప్రధాన కోర్టు ఎదుట అనుమానాస్పద స్థితిలో పడివున్న మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. కోర్టు ఎదుట గల బస్ షెల్టర్ వెనుకనున్న డ్రైనేజీ కాలువపై మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ సహకారంతో విచారణ చేపట్టారు. సంఘటన స్థలాన్ని సిపి వి.బి. కమలాసన్ రెడ్డి పరిశీలించారు.