Medara Jatara:వనదేవతలను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల

Feb 18, 2022, 3:51 PM IST

మేడారం: వనదేవతలు సమ్మక్క-సారలమ్మలు గద్దెలపైకి చేరుకోవడంతో మేడారం మహాజాతరకు భక్తలు పోటెత్తారు. సామాన్యులతో పాటు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వనదేవతలను దర్శించుకున్నారు. మేడారంకు వెళ్లే దారిలో గట్టమ్మ తల్లిని కూడా బిజెపి ఎమ్మెల్యే ఈటల దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.