Feb 28, 2021, 11:47 AM IST
ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్)లో యూరియా ఉత్పత్తి గ్రేడ్ -1 ట్రయల్ రన్ ప్రారంభమైంది. రాత్రి రెండున్నర గంటల సమయంలో ప్రారంభమైన ట్రయల్ రన్కు సీఈఓ నిర్లప్ సింగ్ రాయ్ హాజరయ్యారు. మొత్తం రూ. 6180 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టు పునరుద్ధరణను చేపట్టాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 'వేపనూనె పూత' రాసిన యూరియాను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు.