May 14, 2020, 2:37 PM IST
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. పోతిరెడ్డి పాడు గురించి మాట్లాడుతూ నీళ్ల సమస్యమీద మాట్లాడి అధికారంలోకి వచ్చి కేసీఆర్.. ఇప్పుడు నీటిని ఆంధ్రాకు దారాదత్తం చేయడం వ్యభిచారం లాంటిదని అన్నారు. మాటమీద నిలబడని వ్యక్తి కేసీఆర్ అంటూ దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై ప్రతిపక్షాలు అడిగితే.. రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం గగ్గోలు పెడుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేను చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు ఇస్తా అనడం సిగ్గుచేటన్నారు.