ఆలయాల్లో అన్నీ కొత్త రూల్స్.. నో అర్చన, నో అభిషేకం..

Jun 8, 2020, 4:19 PM IST

తెలంగాణలో 76 రోజుల తరువాత సోమవారం ఉదయం నుంచి ఆలయాలు తెరుచుకున్నాయి. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం భక్తులతో కళకళ లాడుతోంది. అయితే నిబంధనలకు లోబడే భక్తులను అనుమతిస్తున్నామని చెబుతున్నారు. అర్చనలు,అభిషేకాలు, హారతి, శఠగోపం, గంటలు కొట్టడం, తీర్థప్రసాదాలు ఉండవు.. కేవలం అమ్మవారిని దూరంనుండి దర్శించుకుని వెళ్లాల్సిందే అన్నారు.