Telangana MLC Election 2021: నిర్మల్ లో ఓటేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Dec 10, 2021, 11:49 AM IST

నిర్మల్: శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో  విజయం తమదేనని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీఆర్ఎస్ ఎమ్మెల్సీ  అభ్యర్థి దండే విఠల్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మంత్రి పేర్కొన్నారు. మంత్రితో పాటు పలువురు ప్రజాప్రతినిదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు