మద్యం దొరక్క పిచ్చెక్కుతున్న జనం... ఎర్రగడ్డ ఆస్పత్రి కిటకిట..చూడండి...

Apr 1, 2020, 12:12 PM IST

లాక్ డౌన్ నేపధ్యంలో మద్యందుకాణాలు మూతపడడంతో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ రోగులతో కిటకిటలాడుతోంది. ఒక్కసారే మందు దొరకక అలవాటు పడినవారు పిచ్చోళ్లుగా మారిపోతున్నారు. కల్లు, మందు రోజూ తాగే అలవాటు ఉండడంతో ఒక్కసారిగా మానేయాల్సి రావడం ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే రంగారెడ్డిజిల్లాలో ఒకతను ఉరేసుకుని చనిపోగా, ఇంకొంతమంది ఇంట్లోనుండి పారిపోయారు. మరికొందరు మతిస్థిమితం లేని పనులతో కుటుంబాలను అల్లకల్లోలం చేస్తున్నారు.