షాద్ నగర్ లో ఇంట్లోకి చొరబడిన చిరుత..మత్తుమందు ఇచ్చి...

Jan 20, 2020, 1:20 PM IST

షాద్ నగర్ లో చిరుతపులి కలకలం రేపింది. స్థానికులమీద దాడికి దిగింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ టీం రంగంలోకి దిగింది. చిరుతకు మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు. అయితే చిరుతను పట్టుకునేముందు స్థానికులు ఎవ్వరూ బైటికి రాకుండా తలుపులు పెట్టుకుని ఇంట్లోనే ఉండాలని పోలీసులు ఆజ్ఞలు జారీ చేశారు. చిరుతకు మత్తుమందు ఇచ్చి బంధించి, జూకు తరలించారు. ఈ క్రమంలో చిరుత దాడిలో పలువురు పోలీసులకు, స్థానికులకు గాయాలయ్యాయి. వీరికి స్థానిక ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు.