చైనాకు బుద్ధి చెప్పాల్సిందే... రగిలిపోతున్న ప్రజలు...

Jun 19, 2020, 11:38 AM IST

భారత్ - చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు సామాన్యులూ శాల్యూట్ చేశారు. చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే చైనా వస్తువులను బహిష్కరించాలంటూ నినదించారు. కరోనా వైరస్ కూడా చైనా నుండే వచ్చిందని.. చైనా ఇంతలా దాడి చేస్తుంటే మనం దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయాలంటూ చెప్పుకొచ్చారు. దీనికోసం చైనా యాప్స్ ను, చైనా వస్తువులను బహిష్కరించాలని అంటున్నారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ పెట్టాలని, దీనివల్ల తెలంగాణ నుండి మరింతమంది జవాన్లుగా మారతామని అంటున్నారు.