తయారీ విధానం..
ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. మీడియం మంటపై ఉంచి దనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండు మిర్చీ, కంది పప్పు వేసి.. బబాగా వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. రెండు, మూడు నిమిషాలు అలానే వేయించి తర్వాత.. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి వేగిన సమయంలో కమ్మని వాసన మనకు వస్తుంది. అలా వచ్చినప్పుడు వేగిపోయినట్ల మనకు అర్థమౌతుంది. ఇప్పుడు వేయించిన వాటన్నంటినీ చల్లపడే వరకు ఆగాలి.
వేయించిన మసాలా దినసులు ఆరపోయిన తర్వాత... వాటిని బ్లెండర్ లో వేసి.. మంచిగా పొడి చేసుకోవాలి. అలా బ్లెండ్ చేయడానికి ముందు... కరివేపాకు ఆకులను కూడా వేయాలి. అయితే.. పొడి లాగానే చేసుకోవాలి. ముద్ద లాగా, పేస్టు లాగా కాకుండా జాగ్రత్తపడాలి.