కన్నీళ్లు కూడా ఇంకిపోయే ఎడారిలో.. ఓ తెలంగాణ కార్మికుడి ఆవేదన..

May 18, 2020, 4:27 PM IST

సౌదీ అరేబియా ఎడారుల్లో పనిచేస్తున్న నిజామాబాద్ కు చెందిన బుచ్చన్న ఫణిగిరి తనను ఇండియాకు తీసుకుపొమ్మంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నాడు. మండే ఎండల్లో ఎడారిలో, బ్రెడ్డు ముక్కలకు పొడికారం పెట్టుకుని తింటూ బ్రతుకుతున్నానని, పరిస్థితి దుర్భరంగా ఉందని అంటున్నాడు. జీతం కూడా మూడునెలలకొకసారి ఇస్తున్నారని తానిక్కడ ఉండలేనని దయచేసి ఇండియాకు రప్పించమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించుకుంటున్నాడు.