May 16, 2020, 5:43 PM IST
జగిత్యాల జిల్లా, ధర్మపురిలో మండల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మాజీ మంత్రి కి.శే. జువ్వాడి రత్నాకర్ రావు సంస్మరణ సభ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు. రత్నాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.