వలస కూలీలకు సొంత ఖర్చులతో రవాణా ఏర్పాట్లు .. వీడ్కోలు చెప్పిన సత్యవతి రాథోడ్

May 4, 2020, 3:27 PM IST

గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ లో పలు ప్రాంతాల్లో, గ్రామాల్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వలస కూలీలకు సొంతఖర్చులతో రవాణా ఏర్పాట్లు చేసి వీడ్కోలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ...వలస కూలీలను తరలించడంలో కేంద్రం ఒక రోడ్ మ్యాప్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసిందన్నారు. ప్రైవేట్ బస్సులు పెట్టి, సొంతంగా డీజిల్ పోయించి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.