అడ్వెంచర్ స్పోర్ట్స్ పార్క్ ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (వీడియో)

Aug 23, 2019, 5:09 PM IST

మొక్కలను పెంచితే మానవాళి మనుగడకు ఎలాంటి ముప్పు ఉండదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.ఆదిలాబాద్ లో సాహస క్రీడల పార్క్  ను(అడ్వెంచర్ స్పోర్ట్స్ పార్క్)ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారంనాడు ప్రారంభించారు.రాష్ట్ర ప్రభుత్వం హరిత హరం ద్వారా పెద్దఎత్తున మొక్కలను పెంచుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ప్రతి ఒక్కరూ తమవంతుగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.

ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని అందించాల‌నే ఉద్దేశ్యంతో అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. పచ్చని చెట్లు, బోటింగ్, జంతువులతో ఇప్పటికే  సందర్శకులకు  ఆహ్లాదాన్ని పంచుతున్న మావ‌ల హరితవనంలో నేటి నుంచి సాహసక్రీడలు సైతం అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు