కరీంనగర్ జిల్లాలో తొలి దాన్యం కొనుగోలు కేంద్రం... ప్రారంభించిన మంత్రి గంగుల

Apr 15, 2021, 2:24 PM IST

యాసంగి ధాన్యం సేకరణ కోసం కరీంనగర్ జిల్లాలో తొలి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. చెర్లబూత్కూరులో ప్యాక్ అనుభందంగా నూతన వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...45 రోజుల్లో రాష్ట్రం మెత్తం 6400కు పైగా కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని సేకరిస్తామన్నారు. గతంలో చెర్లబూత్కూరులో 17వేల క్వింటాళ్ల దాన్యం ఈ సెంటర్ ద్వారా కొనుగోలు జరిగిందన్నారు.  కాళేశ్వరం జలాల ద్వారా ఎస్ఆర్ఎస్పీ 11ఆర్ కింద చెర్ల బూత్కూరుకి సమ్రుద్దిగా నీరు అందడం, నిరంతరాయ కరెంట్ వల్ల ఈ యాసంగిలో దాదాపు 20వేల క్వింటాళ్ల పైచిలుకు దిగుబడికి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించే ప్రతి గింజను సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.