జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా లోకేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ (వీడియో)

Aug 27, 2019, 12:15 PM IST

జీహెచ్ఎంసీ కమిషనర్ గా లోకేష్ కుమార్ మంగళవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న ఆయనను ప్రభుత్వం జీహెచ్ఎంసీకి బదిలీ చేసింది.  జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న దానకిషోర్ ను జలమండలికి ట్రాన్స్‌ఫర్ చేసింది. లోకేష్ కుమార్ మంగళవారం నాడు ఉదయం బాధ్యతలు స్వీకరించారు.జీహెచ్ఎంసీ  అభివృద్దికి అన్ని రకాల చర్యలు తీసుకొంటామని ఆయన ప్రకటించారు.