ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్ ఓటర్ గా తన పేరును నమోదు చేసుకున్న మంత్రి కే తారకరామారావు

Oct 1, 2020, 6:19 PM IST

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకోసం ఓటర్ లిస్టులో పేరును మంత్రి కేటీఆర్ నమోదు చేసుకున్నారు. ఈరోజు ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను స్థానిక మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం మరింతగా ఉందని మంత్రి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.