అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచారం మరింత జోరందుకుంది. అయితే నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు తమ ఆస్తిపాస్తులు, అప్పులు, కేసుల వివరాలను కూడా వెల్లడించారు. ఈ క్రమంలోనే రాజకీయ ప్రముఖుల వివరాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.