కరీంనగర్ : ఇల్లు అద్దెకు ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలి...కార్డెన్ సెర్చ్ లో పోలీసుల హెచ్చరిక...

Feb 18, 2020, 11:05 AM IST

కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు కరీంనగర్లోని పోచమ్మవాడ లో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ కిరాయిదారులవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అద్దెదారులకు సంబంధించిన ఆధారాలను ఎస్ఎంఎస్ వాట్స్ అప్ లేదా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి అందించినా ఉచితంగా వారికి సంబంధించిన వివరాలను అందజేస్తామని తెలిపారు. పోచమ్మ వాడ ప్రాంతం శివారులో ఉన్నందున కాలనీ వాసులు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సరైన ఆధారాలు లేని 71 వాహనాలు, 7500 రూపాయలు విలువ చేసే పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి శ్రీనివాస్ ఏసీపీలు డాక్టర్ పి అశోక్ లతో పాటు వివిధ విభాగాలకు చెందిన 150 మంది పోలీసులు పాల్గొన్నారు.