కరీంనగర్ లో కరోనా అలర్ట్: 144 సెక్షన్, డాక్టర్లు, పోలీసులు తప్ప అంతా బంద్!

Mar 19, 2020, 2:23 PM IST


కరీంనగర్ లో ఒక్కరోజే ఏడుగురికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో హై అలర్ట్ ప్రకటించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన 11 మంది ఇస్లామిక్ మత ప్రచారకుల బృందంలో ఏడుగురికి కరోనా సోకింది. అప్రమత్తమైన అధికారులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్తగా కలెక్టరేట్ కు 3 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు.