Jul 29, 2019, 5:53 PM IST
అనారోగ్యంతో మరణించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. సోమవారం ఉదయం 11 గంటలకు జైపాల్ రెడ్డి పార్థీవ దేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం గాంధీభవన్లో ఉంచారు. అనంతరం మధ్యాహ్నం ర్యాలీగా నెక్లెస్రోడ్కు చేరుకుని పీవీ ఘాట్ పక్కన అంత్యక్రియలు నిర్వహించారు.