సునామీలా దూసుకొస్తున్న మిడతల దండు.. వస్తే ఎలా ఉంటుందో చూడండి.. (వీడియో)

May 27, 2020, 3:07 PM IST

రాష్ట్రం మీదికి మరో ప్రళయం ముంచుకురాబోతుంది. కరోనా కంటే భయంకరమైన విలయం చూడబోతున్నాం. మిడతల దండు ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్తాన్‌ మీదుగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు విస్తరించింది. జైపూర్ లో సునామీ సృష్టించింది.  ఇప్పుడు తాజాగా తెలంగాణలోకి ప్రవేశించే పరిస్థితులు ఉన్న దృష్ట్యా వ్యవసాయ శాఖ అప్రమత్తమయ్యింది. ఒక్కో మిడత రోజుకు తన బరువుకు సమానమైన ఆహారాన్ని తినేస్తుంది. వాటిలో సంతానోత్పత్తి చాలా వేగంగా జరుగుతుంది. జూన్‌లోగా వాటి సంఖ్య 400 రెట్లు పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా వీటి దాడి ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంటున్నారు.