తెలంగాణ లాక్ డౌన్ : గ్రామ సరిహద్దుల్లో కంచెవేసి కాపలా కాస్తున్న లేడీ సర్పంచ్

Mar 26, 2020, 12:44 PM IST

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం గ్రామ సర్పంచ్ ఉడుత అఖిల యాదవ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ లాక్ డౌన్ నియమాలను అనుసరించి గ్రామంలోని ప్రజలు బయటకు వెళ్లకుండా, బయట నుంచి ఎవరు లోపలి రాకుండా గట్టి జాగ్రత్తలు తీసుకుంది.  గ్రామ సరిహద్దుల్లో కంచెవేసి దానికి తానే స్వయంగా కాపలాకాస్తూ వచ్చినవారికి అవగాహన కల్పిస్తోంది.