పోలీసులను తోసుకుంటూ, తరుమకుంటూ రండి..: కాంగ్రెస్ శ్రేణులకు సీతక్క పిలుపు...

Jul 2, 2023, 2:40 PM IST

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పాల్గొనే సభకోసం రాష్ట్రప్రజలు తండోపతండాలుగా ఖమ్మం తరలివస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. ఇది చూసి తట్టుకోలేని బిఆర్ఎస్ నాయకులు పోలీసులను ఉపయోగించి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలను అడ్డుకుంటున్నారని అన్నారు. పోలీసులు బిఆర్ఎస్ ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని అన్నారు.  

పోలీసులు బిఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారి ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న జనగర్జన సభను విచ్చినం చేసే కుట్రలు చేస్తోందని... దీన్ని చూస్తూ ఊరుకునేది లేదని సీతక్క హెచ్చరించారు.
అడ్డుకునే పోలీసులను తోసుకుంటూ, అవసరమైతే తరుముకుంటూ ముందుకు రావాలని ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలకు సీతక్క సూచించారు.