పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా రాస్తారోకో..

Jun 23, 2020, 12:59 PM IST

గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా జగిత్యాల జిల్లా ధర్మపురి జాతీయ రహదారిమీద కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, భారీగా వసూలు చేస్తున్న విద్యుత్ బిల్లులను తగ్గించాలని నినాదాలు చేశారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని  డిమాండ్ చేశారు.  ఈ రాస్తారోకో తో రోడ్డుకు ఇరువైపులా వాహనాల భారీగా నిలిచిపోయాయి.