కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే.. కొత్త సెక్రటేరియట్ అవసరమా?.. పొన్నం ప్రభాకర్

Jul 7, 2020, 2:14 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌తో జనం అల్లాడుతుంటే ఇంత ఆఘమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేత ఎందుకని టీపీసీసీ నేత పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో ప్రశ్నించారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని ఈ సమయంలో కొత్త సచివాలయం అవసరమా అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇంతటి దుర్భర పరిస్తితులుంటే సీఎం కేసార్ కనీసం వైద్యంపైన సమీక్ష కూడా చేయకుండా ఎక్కడో చీకటిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలనిసూచించారు. ఒకవైపు రాష్ట్రంలో రోజుకు 2000 కేసులు వస్తుంటే, కరోనాపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎక్కడున్నారని whereiskcr# అని ప్రజలంతా ఒకవైపు అడుగుతుంటే, మరోవైపు సెక్రటేరియట్ కూల్చివేతను ప్రారంభించారని మండిపడ్డారు.