పెళ్లికి వెడుతూ తిరిగిరాని లోకాలకు... (వీడియో)

Oct 11, 2019, 7:46 PM IST

స్నేహితుడి చెల్లె పెళ్లికి బయలుదేరిన ఎనిమిది మంది యువకులకు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మిగతావారికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెడితే హైదరాబాద్ నుండి మారుతీ ఎర్టికా కారులో అనంతపురం బయలుదేరిన స్నేహితుల బృందం షాద్ నగర్ సమీపంలో ముందున్న కారును ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ ని ఢీ కొట్టింది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.