విశాఖ మన్యం : ఇంటర్ ఎగ్జామ్స్ కోసం పగడ్బందీ ఏర్పాట్లు

Mar 4, 2020, 12:25 PM IST

విశాఖ ఏజెన్సీ పాడేరు డివిజన్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏపీఆర్, బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఈ రెండు పరీక్ష కేంద్రాల్లో పట్టణంలోని జీజే కళాశాల, ఏపీ ఆర్ కళాశాల, కేజీబీవీ మదర్ విజేత కళాశాలలకు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు హాజరయ్యారు.