Green Challenge : మొక్కలు నాటిన కేంద్రమంత్రి జవదేకర్

Nov 28, 2019, 3:19 PM IST

దేశరాజధానిలో గ్రీన్ సవాల్ కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కె.కేశవ రావు, బండ ప్రకాష్ పాల్గొన్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా 4.8 కోట్ల మొక్కలు నాటడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఎంపీ సంతోష్ కుమార్ ను ప్రకాష్ జవదేకర్ అభినందించారు.