సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య : ఈడీ ముందుకు రియా చక్రవర్తి

Aug 7, 2020, 2:36 PM IST

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తి ఈ రోజు ఈడీ ముందు హాజరయ్యింది. ఆమెపై మోపబడిన మనీలాండరింగ్ కేసులో విచారణలో భాగంగా తన తమ్ముడు షోవిక్ తో కలిసి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు వచ్చింది. కేసు దర్యాప్తు నిలిపి వేయాలని రియా పెట్టుకున్న దరఖాస్తును ఈడీ కొట్టిపడేసింది.