సీజన్ 7లో 6 మంది కంటెస్టెంట్స్ ని ఫైనల్ కి పంపారు. అంబటి అర్జున్, ప్రియాంక జైన్, యావర్, శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఫైనలిస్ట్స్. ఈసారి కూడా ఒకరిని ఎలిమినేట్ చేసి ఆరుగురిని ఫైనల్ కి పంపుతారని అందరూ భావించారు. కానీ బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ షాక్ ఇచ్చాడు. ఓటింగ్ లో వెనకబడిన రోహిణి, విష్ణుప్రియ 14వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్ కి వెళ్లాలన్న వీరి ఆశలు గల్లంతు అయ్యాయి.