ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ బాగా ఫేమస్ అయ్యింది. డైరెక్ట్ గా మాల్స్ కి, షాప్స్ కి వెళ్లి కొనడం చాలా తగ్గిపోయింది. ఎంత చిన్న వస్తువునైనా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు.
కోవిడ్ తర్వాత ఆన్లైన్ షాపింగ్ మరింత వేగంగా, ఎక్కువగా జరుగుతోంది. కొన్ని కంపెనీలు జస్ట్ ఫోన్ కాల్ ద్వారా కూడా ఆర్డర్స్ తీసుకుంటున్నాయి. దీంతో అసలు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అన్ని వస్తువులు ఇంటికి రప్పించుకొనే అవకాశం కలుగుతోంది. అయితే ఇకపై ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ ని క్యాన్సిల్ చేస్తే ఛార్జ్ వసూలు చేయాలని కొన్ని ఈ-కామర్స్ కంపెనీలు అనుకుంటున్నాయన్న వార్త వైరల్ అవుతోంది.