సముద్ర సేతు : మాల్దీవులనుండి 698 మంది భారతీయులు ఇంటికి...

May 9, 2020, 12:13 PM IST

కరోనా లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన 698 మంది భారతీయులను సముద్రమార్గం ద్వారా స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమయ్యింది. ‘సముద్రసేతు’ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా గత రాత్రి మాలే నుండి భారతీయులను ఎక్కించుకున్న ఐఎస్ఎస్ జలాశ్వ బయలుదేరింది.