Russia Ukraine Crisis: ఉక్రెయిన్ నుండి సురక్షితంగా స్వదేశానికి... ఏపీ విద్యార్థులు వీరే...

Feb 27, 2022, 9:47 AM IST

ముంబై: రష్యా దాడులతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపు ప్రారంభమయ్యింది. మొదటగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉక్రెయిన్ బార్డర్ దాటి రొమెనియా చేరుకున్న భారతీయులు 219మందిని ఎయిరిండియా ప్రత్యేక విమానంలో ఇండియాకు తరలించారు. ఇలా ముంబైకి చేరుకున్న భారతీయుల్లో ఎనిమిదిమంది తెలుగు విద్యార్థులు కూడా వున్నారు. వీరిని స్వస్థలాలకు పంపేందుకు ఏపీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.