Feb 21, 2022, 4:33 PM IST
భారత నౌకాదళ ఫ్లీట్ రివ్యూ నేడు విశాఖలో ముగిసింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ INS సుమిత్ర మీద ప్రయాణిస్తూ నేవీ గౌరవ వండఁగణాన్ని స్వీకరించడంతోపాటు యుద్ధ విన్యాసాలను కూడా తిలకించారు. రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారైన సర్వ సైన్యాధ్యక్ష హోదాలో ఫ్లీట్ రివ్యూ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సారి సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ పేరిట చేసే.. నౌకాదళ విన్యాసాల్లో మొత్తం 44 యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలు , జలాంతర్గాములు, అత్యాధునిక నౌకాదళ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు భాగం పంచుకున్నాయి.