తెలంగాణ ఏర్పాటు: తేనె తుట్టెను కదిపిన ప్రధాని మోడీ

Feb 11, 2022, 11:30 AM IST

కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలను తిప్పికొట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై Narendra Modi పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాజకీయ పార్టీలు తప్పు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అవమానించే విధంగా ప్రధాని వ్యాఖ్యలు చేశారని విమర్శిస్తున్నారు. మోడీ వ్యాఖ్యలపై TRS ఎంపీలు సభా హక్కుల నోటీసును కూడా ప్రతిపాదించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మోడీ రాష్ట్ర విభజన తీరుపై వ్యాఖ్యలు చేశారు.