కరోనా ఎఫెక్టెడ్ వ్యక్తిని కలిశారని...స్కూలు మూసేశారు...

Mar 4, 2020, 12:14 PM IST

నోయిడాలోని ఓ పాఠశాలను శానిటైజేషన్ కోసం మూసివేశామని గౌతమ్‌బుద్ధ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనురాగ్ భార్గవ్ తెలిపారు. కోవిద్-19 బారిన పడిన వ్యక్తితో స్కూలు విద్యార్థులు ఓ పార్టీలో కలిశారని ఆయన అన్నారు. ముందుజాగ్రత్త చర్యగా శానిటైజేషన్ చేపట్టామని, స్కూలు బస్సు కూడా శానిటైజ్ చేస్తున్నామని భార్గవ్ అన్నారు. కరోనా సోకిన వ్యక్తికి ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతుందని తెలిపారు.