aashka goradia
సినిమాల్లో స్టార్లుగా జెండా ఎగురవేసే హీరోయిన్లు.. తాము సంపాదించిన సొమ్మును బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. అందులోసక్సెస్ అయ్యి.. వందల కోట్లు సంపాదించినవారు కూడా ఉన్నారు. సౌత్ స్టార్ హీరోయిన్లుగా వెలుటు వెలుగుతున్న సమంత నయనతార లాంటివారు ఇలానే చేస్తున్నారు.
అందులో ముఖ్యంగా నయనతార .. లిప్పమ్, 9స్కిన్ వంటి సంస్థల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తోంది. దీంతో పాటు పెమీ9, డివైన్ పుట్స్, సాయి వేల్ వంటి కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టాడు.సమంత కూడా సాహి అనే తన సొంత టెక్స్టైల్ కంపెనీని నడుపుతోంది. ఇది కాకుండా నర్సరీ స్కూల్ కూడా నడుపుతున్న సమంత ఈ-కామర్స్ కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టింది. సమంత ఇటీవల నిర్మాణ సంస్థను ప్రారంభించి, దాని ద్వారా చిత్రాలను నిర్మించడం కూడా ప్రారంభించింది.
రోజా, లయ, గౌతమి కూతుర్లను చూశారా..? హీరోయిన్లను మించిన అందం వారి సొంతం..
ఆమె పేరు ఆష్కా కొరాడియా. 2002 నుంచి హిందీ టీవీ సీరియల్స్లో నటిస్తున్నారు. జీ టీవీ, సోనీ టీవీ వంటి పలు ప్రముఖ ఛానెళ్లలో ప్రసారమయ్యే సీరియల్స్లో నటించి ఫేమస్ అయిన కొరాడియా చివరిసారిగా 2019లో ప్రసారమైన తాయాన్ సీరియల్లో నటించారు. ఆ తర్వాత నటనకు స్వస్తి చెప్పి.. అక్ష కొరాడియా.. వ్యాపారంలోకి అడుగుపెట్టింది. రెనీ అనే కాస్మోటిక్స్ కంపెనీని ప్రారంభించింది.
40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్, వరుడు ఎవరంటే..?
ప్రారంభించిన అతి కొత్తి రోజుల్లోనే ఆమె లాభాల మీద లాభాలు సాధిచింది. ఆమె కంపెనీ కేవలం రెండేళ్లలో 100 మిలియన్ డాలర్లకు పెరిగింది, అంటే భారతీయ విలువ 834 కోట్లకు చేరింది. ముఖ్యంగా 2024 ఆర్థిక సంవత్సరంలోనే అక్ష కొరాడియాకు చెందిన రెనీ కంపెనీ 400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
Image: Aashka GoradiaInstagram
నటిగా సరైన టైమ్ లో ఇండస్ట్రీని వదిలిన అక్ష.. పారిశ్రామికవేత్తగా జెండా ఎగురవేయడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలోచనలు ఉన్న నటీమణులెందరికో అక్ష ఆదర్శంగా నిలుస్తుందంటున్నారు.