కేరళలో వరద భీభత్సం: 22 మంది మృతి, 30 మంది గల్లంతు (వీడియో)

Aug 9, 2019, 4:14 PM IST

కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలకు ఇప్పటికే 22 మంది మృత్యువాత పడ్డారు. మరో 24 గంటల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం నాడు సీఎం విజయన్  విపత్తు నివారణ శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వరదల కారణంగా సుమారు 30 మంది ఆచూకీ గల్లంతైంది.