Feb 21, 2022, 4:56 PM IST
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యేక ఫ్రంట్ ఏర్పాటు దిశగా రాజకీయాలు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన నేత, పార్లమెంట్ సభ్యులు సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్న ఆయన.. తెలంగాణ సీఎం కేసీఆర్కు అందరిని కలిపి ముందుకు నడిపించే సత్తా ఉందని వెల్లడించారు.