Jan 27, 2020, 2:41 PM IST
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రిపబ్లిక్ డే సందర్భంగా గెస్ట్ టీచర్లు అర్థనగ్న ప్రదర్శన చేశారు. గెస్ట్ టీచర్ల బాధలు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తేవడానికే ఇలా చేస్తున్నామని తెలిపారు. నిరసనకారులు తమ చొక్కాలు తీసి అర్ధ నగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. గెస్ట్ టీచర్లందరనీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.